హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగా ణ): ఆధునిక అభివృద్ధిలో విముక్త సంచార, అర్ధ సంచార జాతులు, కులాలకు కనీసం ఒక శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్శించారు. ఆయా జాతుల అభ్యున్నతి కోసం బాలకృష్ణ రెనకె కమిషన్ సమర్పించిన నివేదికను బుట్టదాఖలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సేవా వృత్తులతో సమాజ ప్రగతికి జీవితాలను అంకితం చేసిన ఆ జాతులను దేశ సాంసృతిక పునర్వైభవంలో, కళలను రక్షించడంలో, అభివృద్ధిలో భాగం చేయకపోవడంపై విచారం వ్యక్తం చేశా రు. బలహీన వర్గాలు, సంచార జాతులు, కు లాలపై కేంద్రం సవతి తల్లిప్రేమను ప్రదర్శిస్తున్నదని దుయ్యబట్టారు. జాతీయ డీఎన్టీ కమిషన్ మాజీ చైర్మన్ బాలకృష్ణ రెనకె అధ్యక్షతన బుధవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ డీనోటిఫైడ్ ట్రైబ్స్ (విముక్త జాతు లు), నోమాడిక్ ట్రైబ్స్ (సంచార జాతులు), సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (అర్ధ సంచార జాతులు), కులాల 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వకుళాభరణం.. ఆయా కులాలు రూపొందించిన ‘హైదరాబాద్ డిక్లరేషన్-2023’ ముసాయిదాను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అ నేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తూ సంక్షేమ రంగంలో రాష్ర్టాన్ని దేశానికే రోల్ మాడల్గా నిలిపారని కొనియాడా రు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 40% నిధులను సంక్షేమ పథకాలకే కేటాయిస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆశ్ర మ పాఠశాలలు ఏర్పాటు చేయడంతోపాటు విదేశీవిద్య కోసం ఏటా 300 మందికి 20 లక్షల చొప్పున సాయం అందిస్తున్నారని గు ర్తు చేశారు. ఇలాంటి పథకాల్లో కనీసం ఒక్కదాన్నైనా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందా? అని ప్రశ్నించారు. ఇకనైనా బాలకృష్ణ రెనకె కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, తొలుత శాస్త్రీయంగా కులగణన చేపట్టి జాతుల జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సంచార జాతుల అభ్యున్నతికి కేంద్రం ఇకనైనా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ ఐ తిరుమలి, ప్రొఫెసర్ చెన్న బసవయ్య తదితర వక్తలు ముక్తకంఠంతో నినదించారు. తొలి రోజు 4 సెషన్లుగా జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరేందర్, ప్రధాన కార్యదర్శి తిపిరిశెట్టి శ్రీనివాస్ నిర్వాహకులుగా, పల్లవి రెనకె జాతీయ సమన్వయకర్తగా, పల్లపు సమ్మయ్య రాష్ట్ర సమన్వయకర్తగా, వెన్నెల నాగరాజు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, రేణు ఆచారి (ఢిల్లీ) దిలీప్ సిసోడియా (గుజరాత్), ఆనందరావు అంగల్వర్ (మహారాష్ట్ర), మర్రి ముత్తు (తమిళనాడు), బాలక్రామ్ సంచారి (పంజాబ్), పియూష్ రంజన్ సాహు (ఛత్తీస్గఢ్), కల్పనా జోషి (కర్ణాటక), సదానంద బాగ్ (ఒడిశా), లీలాధార్ నినానియా (రాజస్థాన్), సుకేంద్ర ప్రతాప్ (ఉత్తర్ప్రదేశ్), రణవీర్ సింగ్, రణధీర్ సింగ్ (హర్యానా) తదితరులు పాల్గొన్నారు.