హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న వాకిటి శ్రీహరికి వేద మంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం తనకు కేటాయించిన చాంబర్లో వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు.