హైదరాబాద్ : జానపదాలకు పుట్టినల్లు తెలంగాణ అని.. సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అలాంటి నేల నుంచి తాజాగా ఈల పాట పురుడు పోసుకోవడం దేశ, విదేశాలకు వ్యాపించడం ఆనందదాయకమన్నారు.
కళరాజ మీడియా, ఎంటర్టైన్మెంట్ సౌజన్యంతో ముద్దసాని వెంకట రమణారెడ్డి.. ఈలపాట రమణ జాతిపిత మహాత్మాగాంధీపై ‘వైష్ణోజన’ పేరిట రూపొందించిన భజనలు ఈలపాటల రూపంలో రూపొందించిన సీడీనీ హైదరాబాద్లోని సారధి స్టూడియోలో మంత్రి జగదీశ్రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అంతరించిపోయిందనకున్న ఈలపాటకు తెలంగాణ పునరుజ్జీవం పోయడం ఆనందదాయకంగా ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, సంగీత దర్శకులు, గాయకులు ఆర్పీ పట్నాయక్, నేపథ్య గాయకుడు నిహల్, ఎన్ఆర్ఐ ఏనుగు లక్ష్మీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈలపాట రమణను ఘనంగా సన్మానించారు.