హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం 11 గంటలకు ఆయనతో ప్రమాణం చేయిస్తారు.
ఈ కార్యక్రమానికి రవిచంద్ర కుటుంబసభ్యులతోపాటు టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్నూరు కాపు సంఘం నేతలు హాజరు కానున్నారు. వీరంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకొన్నారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బండ ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానంలో రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.