హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బక్రీ ద్ను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముస్లింలకు పిలుపు ఇచ్చారు. బుధవా రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి బక్రీద్ ప్రతీక అని కొనియాడారు. ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాం క్షించారు. తెలంగాణకే ప్రత్యేక మైన గంగా జమున సంస్కృతిని ఈ సందర్భంగా వద్దిరాజు గుర్తుచేశారు.