హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తే వారు సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేటీఆర్ చెప్పారు.