హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమే అత్యంత సురక్షితమని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. నిత్యం శానిటైజ్ చేస్తున్న తమ బస్సులే ఉత్తమమని తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సహా సిబ్బంది అందరికీ వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ సిబ్బంది అన్ని సమయాల్లో మాస్క్లు ధరించి ఉంటున్నారని, ప్రయాణికుల భద్రతే తమ లక్ష్యమని పేర్కొన్నారు.