సోన్, జూలై 6: వెదజల్లే పద్ధతిలో వరి సాగుచేస్తే బోలెడు లాభాలు ఉన్నాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లలోని తన పొలం లో వెదజల్లే పద్ధతిలో వరి విత్తనాలు చల్లారు. కూలీల కొరత, పెట్టుబడులను అధిగమించడం కోసం సీఎం కేసీఆర్ వెదజల్లే పద్ధతిని ప్రోత్సహిస్తున్నారని సూచించారు.