Hyderabad | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గత కొన్నిరోజులుగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుండటంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నెల తొలి వారంలోనే 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ సూర్యుడు సుర్రుమంటుడటంతో వేడికి తాళలేక జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
మధ్యాహ్నం 12 తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గతంలో తకువ ఉష్ణోగ్రతలు నమోదైన హైదరాబాద్లో క్రమంగా ‘హీట్ ఐలాండ్స్’ పుట్టుకొస్తున్నాయి. ‘హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. ఈ సంస్థకు చెందిన పరిశోధకులు శబరినాథ్, మేఘన ఈ ఏడాది మార్చిలో నమోదైన ఉష్ణోగ్రతలను లెకించి హీట్ఇండెక్స్ను రూపొందించారు.
ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లను (భూమి ఉపరితలంపై 2-3 మీటర్ల ఎత్తులో నమోదయ్యే ఉష్ణోగ్రతలను) లెకించడం ద్వారా అర్బన్ హీట్ ఐలాండ్స్ను గుర్తించారు. ల్యాండ్ శాట్ శాటిలైట్ డాటా ఆధారంగా ఉష్ణోగ్రతలను లెకించి, వేడిమి అధికంగా ఉన్న 7 ప్రాంతాలను గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మార్ చేశారు. మైలార్దేవ్పల్లి, బీఎన్రెడ్డి నగర్, మన్సూరాబాద్, పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్నగర్ ప్రాంతాలు హీట్ ఐలాండ్స్గా మారినట్టు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 సెల్సియస్ డిగ్రీల మేరకు నమోదవుతున్నట్టు వెల్లడించారు. వాతావరణ కాలుష్యంతోపాటు కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం, చెట్లను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని తేల్చారు. ఇండ్లలో వాడుతున్న ఏసీలు, ఫ్రిజ్ల వల్ల కూడా సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగి హీట్ ఐలాండ్స్ పుట్టుకొస్తున్నట్టు తెలిపారు.