కాళేశ్వరం/రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి పంప్హౌస్లో ఎత్తిపోతలు మొదలయ్యాయి. సోమవారం రెండు మోటర్ల ద్వారా సరస్వతి బరాజ్కు 4,400 క్యూసెక్కుల నీటిని తరలించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపుహౌస్లోనూ ఎత్తిపోతలు తిరిగి ప్రారంభమయ్యాయి. పంప్హౌస్లోని 6, 7వ పంపుల ద్వారా నీటిని విడుదల కొనసాగుతున్నది. ఒక్కో మోటర్ 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలుతున్నది.