హైదరాబాద్: పాత విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కు సపోర్టును నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను వాడుతున్న యూజర్లు వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 10 తర్వాత తాము విడుదల చేసిన సెక్యూరిటీ అప్డేట్స్ ఈ వెర్షన్లకు అప్డేట్ కావని పేర్కొన్నది. అలాగే వచ్చే నెల 7 నుంచి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 109 బ్రౌజర్, గూగుల్ క్రోమ్ కూడా ఈ ఓఎస్లలో పనిచేయవని స్పష్టంచేసింది.