హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాబోయే క్యాబినెట్ సమావేశంలో మెట్రో రైలు మార్గం పొడిగింపు అంశాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మున్సిపల్ శాఖను ఆదేశించారని కేటీఆర్ మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. వర్షాల ప్రభావంతో హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. వృద్ధికి, మౌలిక సదుపాయాలకు మధ్య సమతుల్యం సాధించాలంటే సుస్థిర, భాగస్వామ్య రవాణా సదుపాయాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
మావనవీయతకు నిదర్శనం
వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆయనలోని మానవీయతకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.