హైదరాబాద్ : తెలంగాణలో మార్చి నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల మధ్యలో అంటే 18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్ మ్యాన్ చెప్పారు. ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. హైదరాబాద్లో 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.