కామారెడ్డి : జిల్లా కేంద్రంలో క్రిష్ణమ్మ ఆలయం సమీపంలో దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె గొంతుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత యువతి కామారెడ్డి పట్టణంలోని బర్కత్పురా ప్రాంతానికి చెందిన నిషాత్ ఫిర్ దోస్(21)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.