మహబూబాబాద్ :మహబూబాబాద్ (Mahbubabad)జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో ఓ బాలికను కిడ్నాప్(Student kidnap) చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. వివరాల్లోక వెళ్తే బయ్యారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ప్రణతి అనే విద్యార్థిని జగ్గు తండా నుంచి పాఠశాలకు వెళ్తున్నది.
ఈ క్రమంలో కాకతీయ నగర్ వీధి దగ్గర బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రణతిని బల వంతంగా బైకు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థిని వారితో పెనుగులాడు తుండగా గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులను గమనించిన దుండగులు బైక్ పై పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.