యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం( Yadadri temple) మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్(Union Minister RK Singh) కితాబిచ్చారు. ఆదివారం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆలయ నిర్మాణ రీతులపై ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దారన్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.