దోమకొండ, జనవరి 3: దోమకొండ గడికోటకు యునెస్కో అవార్డు రావడం అభినందనీయమని కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి మీ నాక్షి లేఖి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటను ఆమె మంగళవారం సందర్శించారు.
కోట అందాల ను తిలకించిన ఆమె.. మహాదేవుని ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. గడిలోని బావులను చక్కగా తీర్చిదిద్దారని, పురాతన ప్రాకారాలుగా మెరుగులు దిద్దారని కితాబిచ్చారు.