Bandi Sanjay | పంథాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనపై ఆయన సీఎం రేవంత్కు లేఖ కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. రేపు పరీక్షలని తెలిసి విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటూ అర్థం చేసుకోవాలన్నారు. నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు. జీవో 29 కారణంగా గ్రూప్-1 పరీక్షల్లో 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారన్నారు.
563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులని.. 29 జీవోతో ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. ఈ జీవోతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారన్నారు. జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి రూల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకమన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని.. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారన్నారు. 29 జీవోతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని.. తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.