ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థికసాయం అందించేందుకు కృషిచేసిన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి ట్రస్మా, కేజీ టూ పీజీ విద్యాసంస్థల యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో పల్లాను కలిసిన ట్రస్మా నాయకులు కందాల పాపిరెడ్డి, యానాల ప్రభాకర్రెడ్డి, కేజీ టూ పీజీ విద్యాసంస్థల రాష్ట్ర చైర్మన్ గింజల రమణారెడ్డి, టీపీజేఎంఏ పూర్వ అధ్యక్షుడు కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి, ప్రైవేట్ టీచర్స్ ఫోరం కన్వీనర్ టీ పర్వత్రెడ్డి తదితరులు కలిసి ధన్యవాదాలు తెలిపారు.
–రామగిరి