హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును కేంద్ర అధికారుల బృందం ప్రశంసించింది. అలాగే, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆర్థిక సలహాదారు, ఐఈఎస్ మమతా శంకర్ శుక్ర, శనివారాల్లో తన బృందంతో కలిసి హైదరాబాద్లో పర్యటించారు.
పలు రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ-పాస్ ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై అభినందించారు. రేషన్ షాపుల్లో ప్రధాని ప్రధాని ఫొటోను ఏర్పాటు చేశారో? లేదో? పరిశీలించారు.
హైదరాబాద్లో రేషన్ దుకాణాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం