హైదరాబాద్ : ఇప్పటికే పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుని, చివరి ఎకరా వరకు నీరందిస్తున్న తెలంగాణ సాగునీటి రంగంలో మరో ముందడుగు పడింది. ఛనాక – కొరాట బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతుల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా పంపింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లా తాంసీ, బేలా మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఛనాక కొరాట బ్యారేజీకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.