హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్లలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నవంబర్ నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా ఈ మేరకు కేటాయింపులు చేసింది.
తెలంగాణ రాష్ర్టానికి కేటాయించబడిన ఐదుగురు ఐపీఎస్ అధికారుల్లో అవినాశ్కుమార్(బీహార్), కాజల్(ఉత్తరప్రదేశ్), కంకణాల రాహూల్రెడ్డి(తెలంగాణ), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి(తెలంగాణ) ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించిన వారిలో వర్షిత ఆడెపు(ఒడిశా), బి ఆదిత్య(రాజస్థాన్), అభిషేక్ అందాసు(రాజస్థాన్), కోటా కిరణ్కుమార్(బీహార్), చిలుముల రజనీకాంత్(మహారాష్ట్ర) ఉన్నారు.