హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లోని విద్యార్థులకు అందించే యూని ఫాం కుట్టుకూలిని సవరించాలని ప్రభుత్వ గెజిటె డ్ హెచ్ఎం అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ను అసోసియేషన్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. గురుకులాల తరహాలోనే సర్కారు బడుల యూనిఫాం కుట్టుకూలిని సవరించాలని కోరారు.