న్యూఢిల్లీ, మార్చి 1: దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మాత్రమే ఉన్నది.
ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 8.55 శాతం నుంచి 7.93 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 6.48 శాతం నుంచి 7.23 శాతానికి పెరిగింది. దేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా రెండో త్రైమాసికంలో కూడా తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఈ ప్రభావం ఉద్యోగ కల్పనపై కూడా పడిందని నిపుణులు పేర్కొంటున్నారు.