హైదరాబాద్ : టెట్(Tet exam) నిర్వహించిన తర్వతే డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఇవ్వాలని నిరుద్యోగ ఐకాస ఆంధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు గురువారం పాఠశాల కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల ఆందోళనకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు.
వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేవారు ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.