హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రోడ్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) స్కీమ్ కింద రాష్ట్రంలోని వివిధ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.153.9 కోట్లు మంజూరు చేసింది. వివిధ జిల్లాల్లోని ముఖ్యమైన రోడ్లను అభివృద్ధి చేయాలన్న స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదన మేరకు రోడ్లు, భవనాల శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపడంతో ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో పలు సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడంతోపాటు మరికొన్ని రోడ్లను విస్తరించనున్నారు. ఇందుకోసం త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.