వరంగల్ : జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం వద్ద ఉన్న ప్రభుత్వ టెక్సో గోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి వేస్తున్నారు. ఈ ప్రమాదంలో కా గోదాంలోని రూ. 35 కోట్ల విలువైన వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలాన్ని టెక్స్ టైల్ అధికారులు సందర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. ఈరోజు సాయంత్రం వరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా, నిన్న సాయంత్రం ప్రభుత్వ గోదాంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.