భీమ్గల్/మోర్తాడ్, వేల్పూర్, అక్టోబర్ 8 : వచ్చే ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని గ్రా మాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నా యి. తాజాగా భీమ్గల్ మండల కేంద్రంలోని మేరు సంఘానికి చెందిన 127 కుటుంబాల వారు బాండ్ పేపర్పై రాసిన తీర్మాన ప్రతిని ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు. మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన గురుడుకాపు వృద్ధ సంఘం సభ్యులు, వేల్పూర్ మండలం దేవాంగ సంఘానికి చెందిన 54 కుటుంబాలు తీర్మాన ప్రతులను ప్రజాప్రతినిధులకు అందజేశారు.
మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 8 : మంత్రి శ్రీనివాస్గౌడ్కు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలువాలని ఆకాంక్షించింది. ఆదివారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి యూనియన్ ప్రతినిధులు మద్దతు పత్రాన్ని అందజేశారు. ఉద్యోగుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రికి అండగా ఉంటామని వారు ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు సనాతన బాలస్వామి, ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.