బాన్సువాడ, ఆగస్టు 29 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామస్థులు బాసటగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీని వాస్రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సం క్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే కా రు గురుకు ఓటేసి శ్రీనివాస్రెడ్డి గెలిపించాలని తీర్మానించారు. ఈ మేరకు వారు మంగళవారం సాయంత్రం స్పీకర్ నివాసానికి తరలివచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మూకుమ్మడిగా చేసిన తీర్మాన పత్రాన్ని స్పీకర్కు అందజేశారు.