సికింద్రాబాద్, మే 6: తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొండా దేవయ్యపటేల్, ప్రధాన కార్యదర్శిగా వైద్యం వెంకటేశ్వరరావు పటేల్, కోశాధికారిగా విష్ణు జగతి పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఏకగ్రీవ ఎన్నికతో సంఘం ఐకమత్యంతో ముందుకెళ్లి అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సంఘం ప్రతినిధులు సీ విఠల్, రౌతు కనకయ్య, బూరుగుబావి హనుమంత్రావు, చెల్లా హరిశంకర్, దాసరి రాము తదితరులు పాల్గొన్నారు.