హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.63.42 లక్షల నగదు సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.42.92 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
లా అండ్ ఆర్డర్ కింద లైసెన్స్ ఆయుధాలను 4,463 సేకరించగా, సీఆర్పీసీ కింద 637 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 1770 బైండోవర్, 1205 నక్కాస్ ఆపరేషన్స్, 796 నాన్ బెయిలబుల్ వారంట్ నమోదు చేసినట్టు పేర్కొన్నారు.