జహీరాబాద్, డిసెంబర్ 31: భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన మహాదేవి (35) భర్త ఇటీవల మరణించాడు. భర్త మృతిచెందడంతో మనోవేదనకు గురైన ఆమె ఆదివారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది.
అయితే గ్రామానికి చెందిన నర్సిములు (40) అనే వ్యక్తి గ్రామ సమీపంలోని మరో వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో గొడవ పడి మద్యం మత్తు లో ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. గ్రామంలో ఒకేరోజు ఇద్దరు వేర్వేరు బావుల్లో పడి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిరాగ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.