హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్’ను ప్రారంభించింది. ఆధార్ సంబంధ ఫిర్యాదుల స్వీకరణ, ప్రాసెసింగ్, పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల ప్రజలకు సేవలు అందిస్తున్నది. రోజుకు సుమారు 200 మంది వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అన్ని రకాల వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆధార్ సీఈవో సౌరబ్ గార్గ్ హైదరాబాద్ కార్యాలయ సిబ్బందిని అభినందించారు.