హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : దేశంలోని అన్ని వర్సిటీల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 31లోపు అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి మనీష్జోషి ఆదేశించారు. సెంట్రల్ వర్సిటీలు, స్టేట్, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలన్నింటిలోనూ అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని సూచించారు. లేనిపక్షంలో ఆయా వర్సిటీలపై చర్యలుంటాయని హెచ్చరించారు.