Srisailam | శ్రీశైలం, మార్చి 27 : శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్ర్తోక్తంగా ఆరంభమయ్యాయి. గురువారం ఉదయం ఈవో శ్రీనివాసరావు దంపతులు, శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేయ్యడంతో ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. స్థానాచార్యులు లోక కళ్యాణం కోసం శివసంకల్పాన్ని పఠించిన వేదపండితులు అతివృష్టి అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికలు శివసంకల్పాన్ని పఠించారు. గణపతిపూజ అఖండ దీప కళశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యహ్వచనం,చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కళశస్థాపన, కంకణపూజ, కంకణధారణ జరిపించబడ్డాయి. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని నిర్ణీత ప్రదేశంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా చేశారు.
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భృంగివాహానాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వలన పనులలో ఏకాగ్రత లభించి, సర్వపాపాలు హరించబడుతాయని పురాణాల్లో చెప్పబడింది.
కన్నడిగుల ఇలవేల్పు శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలు నిర్వహించారు. చతుర్బుజాలు కలిగిన ఈదేవి పై రెండు చేతులల్లో పద్మాలు, కుడివైపు అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో భక్తాధులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వలన శత్రుభాధలు నివారించబడి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామిఅమ్మవార్లును ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, నందిమండపం నుండి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, కేరళచండీమేళం, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావుతో పాటు చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్అయ్యన్న, పిఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, ఏఈఓలు హరిదాస్,స్వాములు సూపరింటెండెంట్ హర్యానాయక్,ఆలయ పరివేక్షకులు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.