TS Weather | తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఆదివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.