కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘోర ప్రమాదం జరిగిది. ముణుగూరు మండలంలోని సమితిసింగారం వద్ద గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.