హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు బైక్ వెళ్తూ అదుపు తప్పి దుకాణాన్ని ఢీకొట్టారు. ఘటనలో తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే మృతువాత పడ్డారు. మృతులను నగారానికి చెందిన విశాల్, రాజుగా గుర్తించారు. నిజామాబాద్ ఆర్పీ రోడ్ నుంచి గాంధీచౌక్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.