సంగారెడ్డి : సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు(Swimming) వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గుమ్మడిదల మండలంలో చోటు చేసు కుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక వీరన్న చెరువులో(Pond)సూరారానికి చెందిన శ్రవణ్(17) శంకర్(22శ్మిత్రులతో కలిసి హోలీ(Holi)సంబరాల అనంతరం వీరన్నగూడెం చెరువులో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.