మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 24: కారు దూసుకెళ్ల డంతో ఇద్దరు మహిళా పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మెదక్ జిల్లా కేంద్రంలో జరిగింది. యాదమ్మ (52), నర్సమ్మ (50), విజయ మెదక్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటలకు మున్సిపాలిటీ సమీపంలోని పెట్రోల్ బంకు పక్కనుంచి వెళ్తుండగా, వెనుక నుంచి దూసుకొ చ్చిన కారు యాదమ్మ, నర్సమ్మ, విజయతో పాటు పెట్రోల్ బంకులో స్వీపర్ శాంతమ్మను, ఆమె బంధువు మరియమ్మను ఢీకొట్టింది.
నర్సమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా యాదమ్మ మృతిచెందింది. ఈ ఘటనలో విజయ, శాంతమ్మ, మరియమ్మ తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కారు డ్రైవర్ నిద్ర మత్తులోనే కారును వేగంగా నడుపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.