హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతున్నది. గూడ గ్రామ శివారులో ఇవాళ ఉదయం రెండు పులులు సంచరించాయి. ఈ విషయంపై అటవీ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పెన్గంగ కాలువ వద్ద పులులు సంచరిస్తుండగా.. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
చనకా – కొరటా కెనాల్ గుండా పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లగా.. స్థానికులు కొందరు పులులను సెల్ఫోన్లలో వీడియో తీశారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి పులులు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇటీవలికాలంలో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలుచోట్ల పశువులపై దాడి చేసిన సంఘటనలున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ రెండు జిల్లాల్లో పులుల దాడులు పలువురిపై దాడికి పాల్పడ్డాయి. చంద్రాపూర్ జిల్లాలో ఒక్కరు, గడ్చిరోలీ జిల్లాలో మరొకరు పులి దాడిలో మృతి చెందారు.