లింగంపేట (తాడ్వాయి), జూన్ 24: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమి గ్రామంలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించారు. డయేరియా పంజా విసరడంతో గ్రామంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే గ్రామానికి చెందిన నాన్మీన్ (9), మాచారెడ్డి సావిత్రి (65), గైని సత్యరాములు (45) అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డీఎంహెచ్వో, వైద్యాధికారులు గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామానికి చెందిన చిన్న భూమయ్య (60), మెట్టు స్వామి (30) డయేరియాతో మృతి చెందిన విషయం తెలిసి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ గురువారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.