జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేరు వేరు చోట్ల పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గద్వాల మండలం బస్రచెరువు గ్రామంలో శశిధర్(14) అనే బాలుడు మృతి చెందాడు. అలాగే మల్దకల్ మండలం పావనంపల్లి గ్రామంలో పొలం పనులు చేస్తుండగా.. రవి అనే రైతుపై పిడుగు పడి మృతి చెందగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే ప్రమాదంలో రవికి చెందన రెండు ఎద్దులు కూడా మృత్యువాత పడ్డాయి.