ములుగు రూరల్, జనవరి 26: ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో విషాదం నెలకొన్నది. జాతీయ జెండా ఎగురవేసే క్ర మంలో విద్యుత్తు షాక్తో ఇద్దరు మృతి చెందారు. ములుగు జిల్లా కేంద్రంలోని దళి త కాలనీకి చెందిన బోడ అంజిత్కుమార్ (36), లాడె విజయ్(25), లాడె చక్రి స్నేహితులతో కలిసి శివాలయం ఎదుట వేడుకలకు ఏ ర్పాట్లు చేశారు. ఇనుప రాడ్కు జాతీ య జెండాను కట్టి గద్దెపై నిలిపేందుకు పైకి లేపడంతో ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్తు తీగకు తగలడంతో అజిత్కుమార్, లాడె విజయ్, చక్రి కరెంట్ షాక్కు గురయ్యారు. తోటి మిత్రులు, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అంజిత్కుమార్, విజయ్ మృ తి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
వైద్యం అందించడంతో చక్రి ప్రాణాలతో బయటపడ్డాడు. మంత్రి సీతక్క దవాఖానకు చేరుకొని చక్రితోపాటు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చి తక్షణ సాయంగా రూ.10 వేల చొప్పున రెండు కుటుంబాలకు అందించారు. విద్యుత్తు అధికారులతో మాట్లాడి రూ.5 లక్షల చొప్పన ఎక్స్గ్రేషియా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. జడ్పీచైర్పర్సన్ బడే నాగజ్యోతి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.