నిర్మల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్(Electric shock) తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కడెం మండలంలోని చిన్న బెల్లాల్లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బెల్లాల్ గ్రామంలో కుమ్రం భీం వర్ధంతి వేడుకల సందర్భంగా జెండాను ఎగురవేస్తుండగా జెండా పైపు విద్యుత్ తీగలకు తగలడంతో గ్రామానికి చెందిన పెంద్రం మోహన్ (24), ఆత్రం భీంరావ్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వేడమ ఎంకును నిర్మల్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.