ఫర్టిలైజర్సిటీ, జనవరి 17: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లిలో బుధవారం రాత్రి కల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందా రు. గోదావరిఖనిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన మామిడి రమేశ్(50), నాంపల్లి నవీన్(30) దుర్గానగర్లోని ఓ ప్రవేటు కాంట్రాక్టర్ వద్ద కూలి పనులు చేస్తారు. సాయంత్రం పని ముగించుకొని అడ్డగుంటపల్లిలోని కల్లు డిపో లో కల్లు తాగారు. తిరిగి వస్తూ ఇరువురు స్థానిక ఆర్యవైశ్య భవన్ సమీపంలో కిందపడ్డారు. నవీన్ సోదరుడు అంజి వారిని తీసుకెళ్లేందుకు రాగా, అప్పటికే మృతి చెందారు. అయితే కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.