మెదక్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలోని అక్కన్నపేట – మెదక్ 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, వారం పదిరోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు.
బుధవారం అక్కన్నపేట స్టేషన్ నుంచి లక్ష్మాపూర్, గంగాపూర్ మీదుగా మెదక్ రైల్వే స్టేషన్కు ప్రత్యేక రైలులో వచ్చి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ప్యాసింజర్ను నడుపుతామన్నారు. స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు.