హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీచేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహదేవ్పూర్, మహాముత్తా రం, మల్హల్రావు, పలిమెల మండలాలతో కాటారం రెవెన్యూ డివిజన్ను, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వా యి, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలతో ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్లను ఏర్పా టు చేసింది. 15 రోజుల్లో అభ్యంతరాలను, ప్రతిపాదనలను సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లిని కొత్త మండలంగా ఏర్పాటూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సారంగపూర్ మండలంలోని బీరవెల్లి, ప్యారమూర్, తాండ్ర, వైకుంఠపూర్, కంకట, వంజర, చిం చోలి (ఎం), జెల్లి, దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రా మాలను కలుపుతూ బీరవెల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ పోచంపల్లి
ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ కావాలనే దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత కుసుమ జగదీశ్తో కలిసి తాను ఏటూరునాగరం రెవెన్యూ డివిజన్ చే యాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కల నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు ములుగు జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడె నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలిపారు.