హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్/నిజామాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): లోక్సభ సభ్యుడంటే హుందాగా ఉండాలి. బాధ్యతతో మెలగాలి. చట్టసభలో ప్రజల వాణి వినిపించాలి. కానీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సభ్యత లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఐపీఎస్ అధికారులను, పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా తూలనాడారు. పోలీసుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు కావడంతో తనను అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. బండి సంజయ్ అరెస్టు సమయంలో బీజేపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించ డంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బంజారాహిల్స్ ఎమ్మె ల్యే కాలనీలోని ఎంపీ అర్వింద్ ఇంటి వద్ద కూడా బందోబస్తు చేపట్టారు. రెచ్చిపోయిన అర్వింద్ పోలీసులను ఇష్టమొచ్చినట్టు తిట్టారు. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ఫిర్యాదు చేశారు. అర్వింద్పై ఐపీసీ 294, 504, 505(1)(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు బంజారాహిల్స్ రోడ్డునంబర్ 12లోని ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో అర్వింద్ అటు నిజామాబాద్, ఇటు బంజారాహిల్స్ ఇంట్లో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతున్నది. అర్వింద్పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు కఠిన చర్యలు తీసుకోవద్దని బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసుల లాఠీలు కరీంనగర్లో పనిచేయలేదా..? లాఠీలు ఏం పీకుతున్నతున్నయ్. ఐపీఎస్ అధికారులు ఏం పీకుతున్నారు? మీరు, మీ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తున్నారా? కేటీఆర్, కేసీఆర్ల వద్ద పోలీసు లాఠీలు లంచాలు తీసుకుంటున్నాయా..? మీరు మీ డిపార్ట్మెంట్ చెంచాగిరీ చేస్తున్నారు..’ అని తన ఇంటి ముందు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను అర్వింద్ నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు.