రంగారెడ్డి: జిల్లాలోని కొత్తూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఫాతిమాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన స్కూటీ.. ఆగిఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులిద్దరు మైనర్లని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మరణించినవారి వివరాలు తెలియాల్సి ఉన్నది.